మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

29, అక్టోబర్ 2010, శుక్రవారం

కాదంబినీ- హేమాంగిని


పాపాయికి పరిక్షలు నడుస్తున్నాయ్ కదా .అందుకని అది పొద్దుటే ఐదుకంతా లేసేస్తుంది .స్వంతంగా, ఎవరూ లేపాల్సిన పని లేకుండా .ఇంత చిన్నప్పుడే బయోలాజికల్ క్లాక్ సెట్ కావడం ఆశ్చర్యమే .నానని లేపుతుంది నానా లే నానా అని లేవకుంటే ఏడుపు మొదలు పెడుతుంది .రాత్రి పడుకునేప్పుడు కూడా ఐదుకంతా లేపాలని ఒట్టు పెట్టించుకుంటుంది .ఇవాళ అట్లాగే లేచింది .మా అమ్మ అంటుంది ఎంత అదృష్టం ఇంత మంచి కూతరు పుట్టింది నాకూ పుట్టింది దండగమారి కూతురు అని .నేను మా అమ్మ ఎనిమిది వరకు చదవాలంటే గడియారంలో ఏడు గంటల్ని ఎనిమిదికి తిప్పి ఎనిమిదని చూపించి పడుకునే దాన్ని .పది రోజుల క్రితం మా అమ్మ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి .అంచేత పాపాయిని బడికి సిద్దం చేసేందుకు నేను లేవాల్సిన పని లేదు .మా నాన్న దాని చదువు చూస్తాడు ,మా అమ్మ స్నానం చేపిస్తుంది ,మా పెదమ్మ జడలేస్తుంది ,జడలేసేప్పుడు మా అమ్మ తినిపిస్తుంది .చుట్టూ మనుషులే .ఆలాజాలంగా .ఆది వారం వాళ్ళు వెళి పోతారు .అప్పుడు మళ్ళీ మేం ముగ్గరమే.నేను మా ఊరి నుండి ఒందల కిలోమీటర్ల దూరపు వరుడ్ని ఎంచుకున్నా.అదృష్టం అతనికి మరో కొన్ని ఒందల కిలోమీటర్ల దూరంలో ఉద్యోగమిచ్చింది.ఏం చేస్తాం కడుపు కూటి కోసం పని చేయక తప్పదు కదా ..అన్నీ ఉంటాయ్ గంటల తరబడి మాట్లాడటానికి ఫోన్లు ,చూసుకోవడానికి వెబ్ కామ్లు కానీ ఏదో లోటు ముక్యంగా పాపాయికి .ఎన్ని అభిప్రాయ భేదాలున్న మనుషుల్ని ఏవీ పూరించాలేవు కదా .
ఇవాళ పాపాయికి మా అమ్మ స్నానం పోస్తుంది పాపాయి ఏవేవో కబుర్లు చెప్తుంది .ఈ మధ్య అది శరత్ హేమంగిని కథ విన్నది విన్నప్పుడు అడిగింది హేమంగిని అంటే ఏంటని. చెప్పాను బంగారం వంటి శరీర భాగాలు కలదని .మా అమ్మని ఆ ప్రశ్న వేసి టెస్ట్ పెట్టింది మా అమ్మ ఫెయిల్ అయ్యింది మా నాన్న పాసయ్యాడు .మళ్ళీ కాదంబిని అంటే ఏంటని అడిగింది .మా నాన్న చెప్ప లేక పోయాడు .ఆ ప్రశ్న నా దగ్గరకే వస్తుంది ఎలాగూ. అంచేత నిదర మంచం మీదే నిఘంటువు పట్టుకు చూసా కాదంబినీ అంటే స్త్రీ ,మేఘాల వరుస అని అర్థాలు ఉన్నాయ్ .చెప్పే సరికి పాపాయి సంతృప్తి పడింది .శరత్ కథలలో ఒకటి హేమంగిని. దయ ప్రేమ మెండుగా ఉన్న స్త్రీ పాత్ర హేమాంగిని కాగా ,కటినమైన హృదయం కలిగిన స్త్రీ కాదంబిని .వీరిద్దరూ తోటి కోడళ్ళు . కాదంబిని మారుటి తమ్ముడు కృష్ణుడు. తల్లి చని పోయి ఆశ్రయం కోసం మారుటి అక్క దగ్గరకి కృష్ణుడు రావటం .అక్కడ వాడి దుస్థితి .తనకేమీ సంభంధం లేకున్నా హేమాంగిని వాడి విషయంలో స్వంత భందువల్తో పోట్లాడటం చివరికి వాడ్ని తనే పెంచుకునేందుకు భర్త ఒప్పుకోక పోవడంతో భర్తని వదిలెయడానికి సిద్ద పడటం, చివరికి భర్త ఒప్పుకోవడం .కథంతా ఉద్వేగ భరితంగా సాగి పోతుంది .హేమాంగిని హృదయ ఔన్నత్యం మనల్ని ఆకట్టుకుంటుంది .అలా ఆకట్టుకునే పాపాయికి ఆ పేరు అంతలా గుర్తుండిపోయింది.గుర్తుండి పోవడం కాదు కచ్చితంగా ఉన్నత మైన వ్యక్తిత్వం ఏర్పడేందుకు ఇవాళ కలిగిన ఆ స్పందన మార్గం ఏర్పరుస్తుందని నా నమ్మిక ....

27, అక్టోబర్ 2010, బుధవారం

ఎందుకో .......


ఎందుకో మనసు ఒక్కోసారి ఊరికే దిగులుపడుతుంది
మబ్బు పట్టిన ఆకాశం లా ముసురు పడుతుంది
మిడిమేలపు ఎండలో సన్న జాజిలా మనసు ఒక్కోసారి దుఃఖ పడుతుంది
అకాలంలోవ్రిష్టిలా వద్దన్నా కురుస్తుంది ఎండిపోయినభూమ్యా కాశాల్లా నిస్తేజ మౌతుంది;
బంధువులు వెళిపోయిన బోడి ఇళ్ళు చూసిదుఃఖ
పడ్డపాపాయిలా దుఖపడుతుంది
ఈ నాటిది కాని ఏనాటి దుఖాన్నోభరువుగా మోస్తుంటుంది
ఎప్పుడో ,ఎందుకో కలిగిన వేదనలను మైపూత వేస్తుంది
మనసు ఎందుకో ఒక్కోసారి ఊరికే దుఃఖ పడుతుంది
వద్దు వద్దన్టున్నాదిగులు పడుతుంది

26, అక్టోబర్ 2010, మంగళవారం

పాము -కప్ప

ఇవాళ పదకొండున్నరకి అట్లాగా మా అమ్మ పాముని చూద్దువు గాని రమ్మని కేకేసింది .పది రోజుల క్రితం మా అమ్మ వాళ్ళు నా దగ్గరికి వచ్చేరు .మేమిప్పుడు కాస్త పట్నం వాల్లమయ్యాం గానీ మా అమ్మకి పల్లెటూరి వాసన ఇంకా పోలేదు అంచేత పాము పట్టుకున్నపుడు కప్ప పెట్టె గావు కేకల్ని విని ఇక్కడెక్కడోపాము ఉందని కని పెట్టేసింది .నాతో పాటు నా కుక్క పరిగెత్తుకొచ్చింది .కుక్క భయానికి పాము కప్పని వదిలేసింది .అంత వరకు చోద్యం చూస్తున్న బెంగాల్ కుర్రాడు ఇవాళ కప్ప "కపాల్ బాలో"అని సంతోష పడ్డాడు .అంటే కప్ప అదృష్టం బాగుందని అర్థం .అంతకు ముందో రోజు ఒక పాము మా ఇంట్లోకి వచ్చేసింది . మనిషి చక్కగా ఆ పాముని బయట వరకు నెట్టుకుంటూ వెళ్లి పోయిరంమని సాగనంపేడు .అప్పుడు ఇంకా నాకు పాముల పట్ల బెంగాలీ ప్రజల వ్యవహార స్సైలి తో పెద్దగ పరిచయం లేక పోవడం చేత పాపాయి చిన్నది కదా మేమైతే సరే అనే భయం చేత ఘోరంగా గొడవ చేసి ఆ పాముని చంపించేసాను .


పాముని కొట్టేటప్పుడు కూడా ఆ పాపమంతా నాకే చెందు గాక అని మనుసులో ప్రార్థించుకుని తరువాత పాముఫై దెబ్బ వేసాడు ఆ మనిషి .బెంగాలీలు "మాన్సాయ్" దేవతను పూజిస్తారు .మాన్సాయ్ దేవత మన నాగ దేవత ఒకటే .వారికి ఆ దేవత పట్ల భయ భక్తులు మెండు .అంచేత పాముల్ని సాధ్యమైనంత వరకు చంపరు ఏ పాము కనిపించినా మనమెక్కడ చంపమంటామోనని అబ్బే దానికసలు విషమే లేదనేస్తారు .ఇంట్లోకోచ్చిన పాము సంఘటన తరువాత నేను నింపాదిగా ఆలోచించుకొని బెంగాలీల భావజాలాన్ని గౌరవించాలని నిర్ణయించుకొని ఇప్పుడు పాము కని పిస్తే చూసీ చూడనట్లు వచ్చేయడం నేర్చుకున్న .ఇవాళ పామును గురించి అడిగితే కూడా అలాగే చెప్పారు అదేమీ చేయదు చాలా మంది దానిని జేబులో పెట్టుకు తిరుగుతారు అనీ ఇంకా తుంపర తుమ్పరగా వాన పడేప్పుడు ఈ పాములు ఆకాశం పినించి రాలుతాయని .ఎప్పుడు కరిసినా ఏమీ కాదు కానీ ఆదివారం కరుస్తే మటుకు తిరుగే లేదని చెప్పారు .href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgujl3bJxmHeBAN1Un6lJIliVo767NzPMn7kckfHb5ZCP00OzMl-ZW1pHLRe33wVDqpr0clI5__BHfbXKGkaozeBoudZ1zoryNnlIF4rPrRbXhoANjl7dyyVZwf-byiTJZ8EVRS_G0YkKc/s1600/snake+028.JPG">విషం లేని పాముకి ఆది వారం విషం ఎక్కడనుంచి వస్తుంది .పాముల మాట అటుంచితే మా ఇంట్లో జలగలు కూడా ఉన్నాయ్ .మా కుక్కల్లో కాంచన అనే కుక్కకి ఆరు బయట ఆడటం బాగా ఇష్టం అలా ఆడుకునేప్పుడు జలగలు దాన్ని పట్టుకు ని దాంతో పాటు ఇంట్లోకి వచ్చేస్తాయి .ఇంట్లోకి రాగానే మనిషి వాసన తగుల్తుందేమో కుక్కని వదిలేసి మన వైపు ప్రయాణం మొదలు పెడతాయి .చూసుకుంటే అదృష్టం లేకుంటే వాటికారోజు ఫెస్టివల్ .మా ఇంటికొచ్చే వాళ్ళంతా హడలి పోతుంటారు .పాములు అదో రకం మనల్ని చూసి తప్పుకుంటాయి జలగలు అలా కాదు కదా మనల్నే టార్గెట్ చేసుకుంటాయి మనల్ని దొరకబట్టుకుని కాస్త లోకల్ అనస్తీశియ ఇచ్చి మన రక్తం పీలుస్త్హాయి .అదీ ఇవాళ పాము కప్ప విషయం ఆ పాము అట్లా నా బ్లాగ్ లో ఫోటో ఐంది .నా పోస్టుకో విషయమైంది ....


25, అక్టోబర్ 2010, సోమవారం

పాపాయి -బుజ్జి మేక




ఇక్కడ బానేస్వర్ అనే శివుడి గుడి ఉంది .చాల పురాతనమైన గుడి .రాజుల కాలంలో నిర్మించిన గుడి .కార్తీక మాసం ఇక్కడ కూడా బాగానే జరుపుకుంటారు .రాత్రి ఇంటి ముందు కార్తీక దీపాలు వెలిగించుకుంటారు .నదీ స్నానాలు ,ఉపవాసాలు సాంప్రదాయాన్ని అనుసరించి చేస్తారు . అట్లా బానేస్వర్ మందిరానికి వెళ్ళాం .బావి లోపల ఉన్నట్లు శివ లింగం ఉంటుంది .ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఆలయం పక్కనే ఉన్నచిన్న చెరువు .ఇక్కడ వీళ్ళు చెరువుని పుకూర్ అంటారు .అందులో అతి పురాతనమైన తాబేళ్లు ఉన్నాయ్ .అవి రాజుల కాలం నుంచి ఉన్నాయని వీళ్ళు అంటారు .
తాబెళ్ళని వీరు కచ్ఛపి అని మోహన్ అని పిలుస్తారు .భక్తులు వేసే బొరుగుల కోసం అవి మెడలు చాచి ఒక దానితో ఒకటిపోట్లడుకుంటాయి.కూటి కోసం పోట్లాటలు మానవజీవితంలోనే కాదు అన్ని జీవాజాలాలకితప్పదేమో
.
అక్కడ పాపాయికి ఒక బుజ్జి మేకతో పరిచయం కలిగింది .దేవుని ప్రసాదంగా ఇచ్చిన చక్కర గుళ్ళు పాపాయి మేకకు పెట్టింది .మేక అట్లా పాపాయితో నేస్తం కట్టింది .అలా ఒక్కో గుండు వేస్తూ పాపాయి మేకని మా దగ్గరికి పట్టుకోచ్చేసింది .



చాల సేపు మేకతో ఆడి చివరిగా మేకని మనతో తీసికెలదాంఅని బ్రతిమాలింది .కానీ ఎలా అవి దేవుని మేకలు అని చెప్పాను పాపాయి బలి అంటే ఏంటి ఎందుకు అని అనేక ప్రశ్నలు అడిగింది .మొన్నీ మధ్య ఇక్కడ మదన మొహనుడి ఆలయానికి వెళ్ళాం .అక్కడ కొన్ని మేక పోతులూ మేస్తూ కనిపించాయి .అవే దుర్గా పూజ రోజు బలి ఇవ్వ బోయేది అని వీళ్ళు చూపించారు .రెండు రోజుల తరువాత మందిరం నుండి ప్రసాదం రూపేణా మాంసం మాకు పంపారు . మేకలు చూసినప్పుడే చాల భాధ కలిగింది .
కామాఖ్య మందిరంలో కూడా ఎవరో మేకని తీసుకు వెళుతున్నారు అది గడ్డి నములుతూ హాయిగా వెలుతుందిఅప్పుడూ అనిపించింది. దేవుడు జీవాలని బలి ఇవ్వమని అదుగుతాద యెక్కదైనా అని .ఇవాళ ఇంట్లో చేపలు తెచ్చారు. నేను ఐచ్చికశాకహారిని .చిన్నప్పటి నుండి .ఇవాళ ఎందుకో చేపలు తోమడం చూసాను .బతికి ఉన్నచేపని తల నేలకి కొట్టి చంపుతారు .బాధ సంగతి వదిలి పెడితే సమాధానం మటుకు దొరికింది .ఇంత మంది మాంసాహారం కోసం ఇన్ని జీవాలని చంపుతుంటే దేవుడికి ఏడాదికోసారి ఇచ్చే బలి తప్పెందుకవుతుంది .కనుక బలులను ప్రభుత్వం నిషేదించడమే తప్పు .బలులను నిషేదించడం కరక్టైతే మనం ప్రతి రోజూ చేసే బలులు కూడా నిషేదించాల్సిందే కదా

24, అక్టోబర్ 2010, ఆదివారం

గౌహతి -కామాఖ్య మందిర్




మే ద్వితీయార్థంలో ఇప్పుడు మేముంటున్న కూచ్ బీహార్ ప్రాంతానికి వచ్చినపుడు మొదటిసారి నాకు కామాఖ్య దేవత గురించి తెలిసింది .ఆషాడ మాసం 11 తేదీన ప్రాంతం ప్రజలు "అమ్బుబాచి " పండుగని జరుపుకుంటారు .అస్సాం లోని కొంత బాగం ఒకప్పుడు మేముంటున్న కూచ్ బీహార్ రాజ్యానికి సంబందించింది . రాజే కామాఖ్య మందిరాన్నిమొదటిసారి నిర్మించారు .అమ్బుబాచి పర్వ దినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఒక మేళ కూడా జరుగుతుంది .దానిని అమ్బుబాచిమేళ అని పిలుస్తారు .

v>
అమ్బుబాచి పర్వదినం కామాఖ్య అమ్మవారి రుతు క్రమానికి సంబంధించింది .సంవత్సరానికోసారి కామాఖ్య దేవత రుతుమతి అవుతుందట . సమయంలో ప్రాంత ప్రజలంతా పూజ గదులు మూడు రోజులు మూత పెడతారు .శాఖాహారమే తీసుకుంటారు .సంద్యాదివందనలేవీ చేయరు .


మేముంటున్న ప్రాంతం నుండి గౌహతి 7 గంటల దూరం .పొద్దుటే 7 గంటలికి ఇక్కడి నుండి బయలుదేరాము .సర్క్యుట్ హౌస్ లో బస .బ్రహ్మ పుత్రా నది ఒడ్డున ఉంటుందీ గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్ .గది ముందు కూర్చుంటే కను చూపు మేర నెమ్మదిగా ప్రవహిస్తూ నది ప్రశాంతతనిస్తుంది.పొద్దుటే లేచి దర్సనానికి వెళ్ళాం .కామాఖ్య దేవీ భాగవతం ,కాలిక పురాణంలో చెప్పబడ్డ శక్తి పీటాలాలో ఒక పీటం .దాక్షాయణిదేవి మిగిలిన శరీర భాగాలు ముఖ భాగం కలకత్తా దక్కిన్ కాళీ మందిరం ,స్థాన భాగం ఒరిస్సా భరంపురంలో,పాద భాగం పూరీలో పడ్డాయట .బ్రహ్మపుత్ర నదికి అవతల శివ మందిరం ఉంది .కామాఖ్య మందిరం గర్భ గుడిలో యోనిని పోలిన పీటం ఒకటి ఉంటుంది .అక్కడ ఒక సహజ జల ఊరుతూ ఉంటుంది . జల ఏడాదిలో మూడు రోజులు రక్త వర్ణంలో కనిపిస్తూ ఉంటుందట .దీనినే వీరు దేవత రుతు మతి కావడం గా భావిస్తారు .కామాఖ్య మందిరం నుండి పాతిక కిలో మీటర్ల దూరంలో సువాల్ కుచి అనే ప్రాంతం ఉంటుంది ఇక్కడ ప్రపంచ ఖ్యాతి గాంచిన ముగా పట్టు చీరలు నేస్తారు .అస్సాం మహిళలు మన లంగా ఓణీ ని పోలిన చీరను కట్టుకుంటారు .దీనిని మేఖల అని పిలుస్తారు అయినా మామూలు చీరలు కూడా ఇక్కడ దొరుకుతాయ్ .
రెండవ రోజు రాత్రి ఇంటికి ప్రయాణం అయ్యాం.దాదాపు 370 కిలో మీటర్ల దూరంలో 27o కిలో మీటర్లు అక్కడక్కడ లారీలు తప్ప ఇంకే వాహనాలూ కనిపించ లేదు .అస్సాం తీవ్రవాదుల భయం చేత రాత్రులు ఎవరూ ప్రయాణం చేయరని డ్రైవర్ చెప్పాడు మొత్తానికి కామాఖ్య మందిర దర్శనాన్ని అల్లా ముగించుకుని ఇంటికి చేరాం.అస్సాం గురించి "విషాద కామరూప"అని ఇందిరా గోస్వామి ఒక నవల రాసారు .నవల లోతుగా లేకపోయినప్పటికీ అప్పటి అస్సాం ని కొద్దో గొప్పో మన కళ్ళ ముందుకు తెస్తుంది .అందులోనూ మీకీ కామాఖ్య మందిర ప్రస్తావన కనిపిస్తుంది నవల కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు కూడా పొందింది .



21, అక్టోబర్ 2010, గురువారం

పల్లబ్ దేబ్ నాథ్

మేము ఇవాళ పల్లవ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం .బెంగాల్ కాటన్ చీరలకు ప్రసిద్ధి .మనం బెంగాలి కాటన్ అని పిలిచే చీరల్నే వీళ్ళు తాతేర్ సాదీ అని పిలుస్తారు ..ఒకప్పుడు ఇవి కుటీర పరిశ్రమలుగా కళకళ లాడుతూ ఉండేవి .ఇప్పుడు పవర్ లూం రాక హ్యాండ్ లూం ని బాగా దెబ్బ తీసింది .ఇప్పుడు భారత దేశం లోని అన్ని ప్రాంతాల లాగానే బెంగాల్ లో కూడా చేనేత దెబ్బ తిన్నది .కుటీర పరిశ్రమగా ఎవరూ చీరలు నేయడం లేదు .
బెంగాల్ లోనూ అస్సాం లోనూ మనం వాడే టవల్ కి బదులుగా " గంచా "అనే నూలు బట్టను టవల్ గా వ్యవహరిస్తారు .చాలా పలుచగా ఉండి సులువుగా తడిని పీల్చుకుని ఉతికేందుకు సులువుగా ఉండి త్వరగా ఆరి పోతాయి . ఇప్పుడు బెంగాల్ లో చేనేత కేవలం గంచా అనే ఈ వస్త్ర విశేషం మీద ఆధార పడి నడుస్తుంది .పల్లబ్ వాళ్ళ ఇంట్లో దాదాపు పదిహేను మగ్గాలు ఉన్నాయ్ .ఈ మగ్గాల ఫై వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరూ పని చేయరు .వాళ్ళు యజమానులు .చేనేత కారులు నేస్తారు .నాలుగు గంచాలు కలిపి ఒక తానుగా వ్యవహరిస్తారు .అలాటి తానులు ఒక వ్యక్తి రోజుకు ఆరేడు నేయగలదు .ఒక తానుకు పద్దెనిమిది రూపాయలు కూలి .హోల్ సెల్ లో నాలుగు గంచాల విలువ ఒంద .బయట ఒక్కో గంచా విలువ యాబై రూపాయలు.అట్లా పల్లబ్ వాళ్ళ ఇళ్ళంతా ఈ గంచాలతో నిండి పోయి ఉంటుంది .మేము కొన్ని గంచాలు తీసుకున్నాం .వాళ్ళ ఇంట్లో పెంపుడు పావురాలు గూళ్ళు చాలా ముచ్చటగా కనిపించే .ఇంకా పాపాయి అక్కడ రాట్నం కూడా చూసింది .



























13, అక్టోబర్ 2010, బుధవారం

బెంగాలీల దశరా ......

















బెగాలీలు దశరాని దుర్గా పూజ అంటారు .కారణమేంటో నేను చెప్పలేను కాని వీరు స్త్రీ దేవతలని ఎక్కువగా ఆరాధిస్తారు .కాళీ పూజ, సరస్వతి పూజ,లక్ష్మి పూజ ,విశ్వకర్మ పూజ వీరి ప్రథానమైన పండుగలు . వీరిలో విశ్వకర్మ మాత్రం మగవాడు . అన్ని పండుగలలో ముఖ్యమైంది దుర్గా పూజ అనబడే దశరా.బెంగాలీల జీవితానికి పండుగకు ఎంత లంకె అంటే దాదాపు పండుగకు రెండు మూడు నెలల ముందు నుంచే అందరూ హడావుడి పడటం మొదలు పెడతారు పూజ ఆరంభం ఐతే ఇక బజార్ అంతా నిండి పోతుంది .కనక పండుగ కొనుగోళ్ళు ఇప్పుడే మొదలు పెట్టాలి అనుకుంటారు .పూజ నెల ఆరంభం ఐనప్పటి నుండి దిగులు పడటం మొదలు పెడతారు .ఎందుకంటే పూజ ఐపోతే ఆనందం కోసం మళ్ళీ ఒక ఏడాది ఎదురు చూడాలి కదా అని .నిజంగానే అట్లాగే ఎదురు చూస్తారు దుర్గా పూజా పూర్తైనప్పటినుండి సారి దుర్గా పూజకు డబ్బులు కూడ పెట్టటం మొదలు పెడతారు .చెప్పుల నుండి కారు వరకు దుర్గా పూజకే కొనడానికి ప్రాధాన్యం ఇస్తారుఇక పండుగ పది రోజుల ముందు నుండే (హైదరాబాద్ లో) మన వినాయక చవితికి వేసినట్టు అట్టహాసంగా పందిళ్ళు వేయడం మొదలు పెడతారు . పందిళ్ళు రక రకాలుగ పోటా పోటీగా ఉంటాయ్ . వాటిని ప్రారంభించేందుకు పట్టణ ప్రముఖులను పిలుస్తారు .ఆశ్చర్యంగా ఉత్సవ కమిటీ లలో సర్వ కుల ,సర్వ మతాల వారూ వుంటారు .మేమున్న టౌన్ లోనే రెండొందల పందిళ్ళు దాకా ఉంటాయ్ .ఇక దుర్గా దేవి ప్రతిమలు ఎంత అందంగా ఉంటాయంటే జీవ కళ ఉట్టి పడుతూ ఉంటుంది .బెంగాల్ ప్రజల ముఖ కవళికలు ప్రతిమలలో అచ్చు గుద్దినట్లు కనిపిస్తూ ఉంటాయ్ .పూజకి వేసిన పందిళ్ళ దగ్గర పెట్టె సీరియల్ లైట్ల సెట్లలో శ్రీ శ్రీ చెప్పిన సమస్త వృత్తుల చిహ్నాలు కూడ అక్కడక్కడా కనిపిస్తాయ్ . పూజ కోసమని ప్రపంచం నలు మూలల ఉన్న బెంగాలీలు స్వంత ఊర్లు చేరు కొంటారు పండగ కి కొత్త బట్టలు వేసుకుని చేపలు ,మాంసం సుష్టుగా తిని ప్రజలు ఊర్లో ఉన్నఅన్ని ప్రతిమలు చుట్టి వస్తారు .

నేను చెప్పిన పండుగ పేద మధ్య తరగతి వారిది .ధనవంతుల పండగ ఆనందం నాకు తెలియదు .అయినా ఏడాదికోసారి కొత్త చెప్పులు ,బట్టలు కొనుక్కునప్పుడు వచ్చే ఆనందం ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది కొనుక్కోగలిగినప్పుడు దొరుకుతుందా .మనుషులు పేదవారిగా ఉండాలని కాదు దీని ఉద్దేశ్యం .ఏదీ ఎక్కువగా ఉండకూడదని మాత్రమే ............

విజయ దశమి శుభాకాంక్షలు .

11, అక్టోబర్ 2010, సోమవారం

శరతూ-పాపాయి

కొద్ది కాలం క్రితం మేం శరత్ చంద్ర చటోపాధ్యాయ ఇల్లు చూశాం.హౌరా జిల్లాలో ఉన్న ఇళ్ళు .కలకత్తా లోవేరే ఇళ్ళు ఉంది .ఇప్పుడు కూడా ఎంత ప్రశాంతంగా ఉందొ .అప్పుడు నది ఒడ్డునే ఉండేదట. ఇప్పుడు నది జరుగుతూ జరుగుతూ అలా దూరం వెళ్లి పోయింది .ఆయన రాత బల్ల హోమియో మందు సీసాలూ అట్లాగే ఉన్నాయ్ .రాత బల్ల మీద "s"అనే అక్షరం చెక్కి ఉంది. ఆ ఇంట్లో ఉన్నపుడే శరత్ శ్రీకాంత్ లో కొంత భాగం ,రాముని బుద్ధిమంతనం .బిందుగారబ్బాయి మొదలైనవి రాశాడట .ఆ ఇంటి వాకిలికి ఎదురుగా జామ చెట్టు ఒకటి ఉంటుంది .ఆ ఇంటి ఎదురుగా ఒక చెరువు ఉంటుంది .ఈ రెండూ రాముని బుద్ధిమంతనంలో ప్రస్తావించ బడ్డాయనిఅక్కడ వారు చెప్పారు
శరత్ రచనలు ఆంద్ర దేశంలో చదవని వాళ్ళు దాదాపు అరుదే కదా .నేనూ అన్నీ చదివాను కానీ మళ్ళీ ఆ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని మళ్ళీ చదివాను .మానవ భావోద్వేగాలు అంత బాగా చిత్రించడం శరత్ కి ఎలా సాధ్యమయ్యింది .ఇన్నేళ్ళ తరువాత కూడా అవెంత ఆకట్టుకో గలుగుతున్నాయి .కాలాన్ని చక్రంతో ఎవరు పోల్చారో కానీ ఎంత నిజం .మనిషి ఎంత కాలం భూమిపయ్ ఉంటాడో అంత కాలమూ అవే భావోద్వేగాలు . కొంచం ఫై ఫై మెరుగులు మారాతాయంతే. పాపాయి రోజూ కథలు చెప్పించుకుంటూ ఉంటుంది .మొన్నో రోజు అనిపించింది రాముని బుద్ధిమంతనం చెప్దామని .నా కూతురు మరీ చిన్నది .కొంచెం పెద్ద పిల్లల కథలు చెప్పినా అర్థం కావు .కానీ నెమ్మదిగా రాముని బుద్ధిమంతనం మొదలు పెట్టాను .ఆరేళ్ళ పిల్ల కదా బుద్ధిమంతనం అంటే ఏంటమ్మా అంది పేరుతో మొదటి ప్రశ్న ప్రారంభిస్తూ ...అట్లా చెప్పుకుంటూ వెళ్ళా
తల్లి లేని రాముడూ .అతన్ని తల్లి లా పెంచిన వదిన నారాయణి .నారాయణి తల్లికి రాముని మీద ఎటువంటి కారణం లేకనే కలిగిన ద్వేషమూ .రాముని చేపలు కార్తీక్ ,గణేష్ లు .నారాయణి తల్లి దిగంబరి వాటిలో ఒకటి పట్టించి వండించడమూ రాముని అల్లరీ .పెంచుకున్న చేపల ఫై ప్రేమ .వదిన తల్లి ఫై కోపం .వదిన ఫై ఉన్న గాడతర మైన ప్రేమ .పన్నెండు పదమూడు సంవత్సరాల పిల్ల వాడి భావోద్వేగాలు అలా అల్లి మన ముందు పరిచి వేస్తాడు శరతు.ఆ మాయాజాలం లో ఆరేళ్ళ నా కూతురు ఎంతలా పడి పోయిందంటే ,తాత కు ఫోన్ చేసినపుడూఇంటి కి వచ్చే వాళ్ళ టీచర్కు ఇంకా ఇంట్లో ఉండే అందరికి చెప్పింది .అంతేనా పదమూడేళ్ళు వచ్చే దాక రామునికి వాళ్ళ వదిన తినిపించి నట్టే బువ్వ తిని పించాలని నియమం పెట్టింది .గారాబం చెయ్యాలన్నది .కొంచం చేపలు తెచ్చి కార్తీకు గణేష్ అన్నది

నేనేమనుకున్నానంటే నా కూతురు కూడా శరత్ లాగా అంత మంచి గా రాయగలిగితే ఎంత బాగుణ్ణు అని. కానీ ఖలీల్ జిబ్రాన్ ని ఇంత గా ప్రేమించేస్తూ ఆయన పేరిట బ్లాగ్ మొదలెట్టి పిల్లల గురించి కలలు ఇట్లా కనడం ఏమైనా బాగుంటుందా అని కలనక్కడ డ్రాప్ చేశేసా .కానీ పిల్లల గురించి కలలు కనడమనేది బహుశ తల్లి తండ్రులకు ఒక సహజాతమేమో ఇక్కడ కనిపించేది శరత్ ఇంటి ఫోటో నే

9, అక్టోబర్ 2010, శనివారం

వెస్ట్ బెంగాల్ - పాపాయి


ఇవాళ రేపట్లో తల్లిదండ్రులు అమ్మాయిలకి అమెరికాసంబంధాలు తప్ప మిగిలిన దిక్కులు చూట్టం మానుకున్నారు .అమెరికా ఎట్లా ఉంటుందో ..నేను చూడలేదు గనుక ఎట్లా అనుకుంటానంటే అచ్చం సినిమలోల్లా ఉంటుందేమోనని . కనీసం భారత దేశం కంటే పాతిక, ఏబై ఏళ్ళు ముందు ఉండవచ్చని అంటే అంత ఆధునికంగానన్న మాట .మా ఊళ్ళో వాళ్ళు కోతలకి,నాట్లకి కూలోళ్లు దొరక్కున్నా, సంక్రాంతికి అరిసెల పిండి దంచేందుకు మనుషులు రాక పోగా" సుద్దంగా మిషన్లో ఆడించుకోక ఎందుకొచ్చిందని "ఎదురు సలహా ఇచ్చినపుడు...మనూరిప్పుడు అమెరికా అయిపొయింది అనుకుంటుంటారు .ఇంకా కొందరు మనూరి ముందు అమెరికా ఎక్కడ నూకద్దసలూ అని కూడా అంటుంటారు .అనే వాళ్ళెవ్వరూ అమెరికా చూడ లేదులెండి నాలాగే ...కాకపోతే మా అందరి ఊహా అదేనన్న మాట .
ఇట్లా చాలామంది అమ్మాయిలు పెళ్లి చేసుకుని రెక్కలు కట్టుకుని యాబయ్ఏళ్ళ కాలం ముందుకు వెళుతుంటే నేనేమో అదేదో సినిమాలోలా పాతికేళ్ళ కాలం వెనక్కోచ్చేసా.ఇక్కడ ఇంకా మనుషులు లాగే రిక్షా లున్నాయ్ .ఊరికి పుట్టెడు చెరువులూ ,చెరువుల్లో స్నానమాడే స్త్రీలు ,గంటల తరబడీ గాలం వేసి చెరువు వొడ్డున కూర్చునే సంసారులూ ఉన్నారు .ఇంకా కూలి కోసం మనుషులంటార, కొల్లలు .ఇక్కడే కాదు వీరు ఇప్పుడు మన లాటి సంపన్న రాష్ట్రాలకూ తరలి వస్తున్నారు .మన వాళ్ళు దుబాయ్ కి వెలతారే అట్లాగా .ఇదొక్కటేనా వీళ్ళ ఘనత అమాయకపు బడి పిల్లల్ని ఎక్కడో మాటు వేసి పట్టికెళ్ళి అమ్మేస్తారు .తెల్ల తోలు ఉంటుంది చాల మందికి అదృష్టం అలా కలిసి వస్తుందన్న మాట .రోజు కూడు తప్ప మరే ఆశ లేని నిర్భాగ్య సంసారాలు బోలేడున్నాయ్ .తినే తిండే ప్రథమ ఆశ ఏంటి అంతా నెగెటివ్ పాసిటివ్ ఏమీ లేదా అనుకుంటున్నారా లేకేం బోలెడు మీకు వెనకటి రోజుల గురించి నాష్టాల్జియా ఏమయినా ఉంటె ఇటో సారి ట్రిప్ వెయ్యొచ్చు .అంతేనా రవీంద్రుడు రాసిన ప్రకృతిని ఇప్పటికి మీ కెమెరాలతో కేచ్ చెయ్యొచ్చు
అసలు విషయం చెప్పేద. ఇంకా ప్రభుత్వ పాట శాలలు గుంపులు గుంపులు పిల్లలతో అలరారు తుంటై .మన వాళ్ళు కృషి చేస్తున్న మాతృ భాషా ఉద్యమాల వంటి ఉద్యమాల గ్రహచారం వీళ్ళకు లేదు .ఇంగ్లీస్ష్ మీడియం స్కూళ్ళు అక్కడోటీ ఇక్కడొకటి ఉంటాయంతే .అది కూడా టౌన్ లలోనే .ఇంకో మాటేమంటే గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం ఇక్కడ ఇంకా అలరారడం చేత టౌన్ లు కూడా గ్రామాల లాగే ఉంటాయ్ .కాబట్టి సబ్ డివిజన్ లలో ఆంగ్ల పాట శాలల గురించి అసలేం ఆశ పెట్టుకోకండి .కనుక వీరికి వీరి దేశమే స్వర్గం . వీరి రాష్ట్రాన్ని ఇంత సుందరంగా వెనక్కి నడిపింది ఎవరనుకుంటారు .ముప్పయ్యేళ్ళు పరిపాలించిన కమ్యునిష్టులు .ఒక ఐదేళ్ళు తక్కువ పాతికేళ్ళు వెనకబడిందని ఎందుకన్నానంటే మరి చెప్పండి వారి దారిలోకి అంత మేధావులైన ప్రజల్ని తీసుకు రావాలంటే కనీసం ఐదేళ్లయ్నా పట్టదేమిటి .కనుక ఇక్కడ ఆగి చెప్పెయ్యండి " లాల్ సలాం "
ఇటువంటి ప్రదేశం లో బిడ్డ చదువెలా అని మన తెలుగు దేశం నుండి వచ్చిన ఎవరికైనా దిగులేస్తుంది కదా .నాక్కూడా దిగులేసింది .కానీ శత కోటి కష్టాలకు అనంత కోటి ఉపాయాలంటారు కదా అట్లాగే నేనూ అనుకున్నాను ఏ గడ్డ మీదైతే ఒక టాగూరు ,ఒక శరతూ ,ఒక కుదీరాం బోసు,సత్యజిత్ రే ,ఒక వివేకానందుడూ, పుట్టారో అలాటి చోట నా కూతురూ ఉంది .కనకా ఏదో ఒకటి కాకుండా పోదని .ఆశే కదా జీవితం .....కను చూపు మేరా ఆశ లేని చోటే గొప్ప వాళ్ళు ఉద్భవిస్తారు మరి ..

8, అక్టోబర్ 2010, శుక్రవారం

పాపాయి -చలం


సరైన శిక్షణ ఇవ్వాలంటే శిశువు పుట్టగానే శిక్షణ మొదలు పెట్టమంటాడు చలం .బిడ్డకు రెండున్నరేళ్ళదాక జాగ్రత్తగా శిక్షణ ఇచ్చారంటే ఇంక స్థిరంగా జీవితమంతా శాశ్వతంగా ఉపయోగపడగల ప్రవర్తన ఇచ్చారన్నమాటే కాని మొదటి మూడు సంవత్సరాలు వృధా చేసారా ఇంక వారి పని చాల కష్టమౌతుంది.ఏ శిక్షణ ఐనా ఆరేళ్ళ లోపే అంటాడు .

బిడ్డల చేష్టలను నిదానించి,పరీక్షించి వారికేవిధమైన శిక్షణ మంచిదో ,ఎప్పటికప్పుడు నిర్ణయించుకుంటూ ఉండాలి .

బిడ్డ పైన ప్రేమ కలిగి ఉండాలి .ప్రేమ ప్రయత్నిస్తే వచ్చేది కాదు .కాని మన సౌఖ్యాలకన్న,బిడ్డనీ బిడ్డ అభివృద్దినీ ఎక్కువగా చూసుకోవాలి ...అంటాడు చలం

పాపాయికి ఓ రోజు చెప్పా ..అసలు తెలుసాచలం బిడ్డల్ని మూడో నెల నుంచీ వేరే గదిలో పడుకోపెట్టాలి .కనీసం పరదా ఐనాఅడ్డముండాలి అన్నాడు నువ్వేమో ఇంకా బొజ్జ పైన పడుకుంటాను అంటున్నావ్ అన్నాను. అది విని పాపాయి ఆహ ..చలం మంచోడే కాదు గిజు బాయే మంచోడు అన్నది .గిజు బాయి పాపాయికి ఎప్పుడొచ్చి ఏంచెప్పాడో కానీ చిన్న పిల్లల్ని ఎలా ఒంటరిగా పడుకోపెట్టాలో అర్థమే కాదు మనసుకు బాధ తోస్తుంది .ఏది మంచిదో ఎలా నిర్ణయించుకోవడం

7, అక్టోబర్ 2010, గురువారం

పాపాయి చెవులు


పాపాయికి ఇంత వరకు పాపం చెవులకు కమ్మలే లేవు .అంతగా ఐతే చూద్దాంలే అనుకున్నానా అంతలోనే పాపాయి ఇంకొంచెం పెద్దదయ్యింది .అమ్మకి ,ఇంకా చాలా మందికి చెవికి ఏమో ఉన్నాయని కనిపెట్టేసింది .

ఇవేంది ?అన్నదోరోజు ,కమ్మలూ అన్నాను .ఐతే కొమ్ములు నాకెందుకు లేవూ అంది .(కొమ్ములు కాదు కమ్మలు అని నేను సవరించలేదు )ఏమంటే మరి నీకు చెవులు లేవు అందుకు అన్నాను .పాపాయి చాలా చిన్నది కదా అవునేమో చెవులు లేవేమో అనుకుంది కొంచెం రోజులు .

మరి కాసిని రోజులుకి నాకు చెవులివిగో ,అని చూపించి కొమ్ములు కావాలి అనడం మొదలు పెట్టింది .అయితే మరి చెవులు కుట్టించుకోవాలి అన్నానో రోజు .చెవులు కుట్టించుకోవడం అంటే ఏంటమ్మా అంది . చెవులకి కొమ్ములు పెట్టటం కోసం కొంచెం బొక్కలు పెడతారు .గోడకి శీల కొడుతుంటే చూపించి ఇట్లాగ అని చెప్పాను .గోడ ఏడవదు కదా అంచేత పాపాయి మరి కాసిని రోజులు అమ్మ, చెవులు కుట్టించుకుంటా..కొమ్ములు పెట్టుకుంటా అని .. అడగ బట్టింది

ఒక రోజు ఇక సరే అనేసుకుని సాంప్రదాయ బద్దంగా ఒక వృద్ద కంసలాయనకి చేవులప్పగించాం.కను మూసి తెరిచే లోగా ఒక చెవ్వు కసుక్కున దిగిందా ..పాపాయికి అర్థమే కాలేదు. పెద్దాయన అమ్మాయ్ నీ కూతురు చాల ఓర్పు గల పిల్ల ఔతుందని మురుస్తూ రెండో చెవికి వచ్చాడు .రెండో చెవికి పట్టు దొరకలా .పాపాయి పాపం ఓర్పు గలదే .కళ్ళ నీళ్ళు పెట్టుకుందే కానీ అల్లరి చేయల . ఆ పెద్దాయన కాళ్ళకి కాస్త దణ్ణం పెట్టవే అంటే ససేమిరా అంది .అంతా సద్దు మనిగాక చెవులు కుట్టించు కోవడం అంటే ఇదా అమ్మ అన్నది.

సరేలేఅయిపొయింది కదా అనుకునే లోపలే ఆ రెండో చెవి తేడా చేసి ఇంత ఉబ్బింది .నా వైద్య స్నేహితుడు అన్నాడు, తీసేసేయ్ ఇన్ఫెక్షన్ ముదిరితే వినికిడికి ప్రమాదం నా కూతురికీ ఇలాగే జరిగిందీ అని .ఎలా తీయటం మరి చెవి ఇంత వాసిందే అంటే నేయ్ల్ కట్టర్ పెట్టి కత్తి రించేయ్ అన్నాడు .ఇప్పుడు పాపాయి ఇంకొంచెం పెద్దదయింది కదా .స్కూల్ కి వెళుతుంది రెండు నెలల్నించి .ఇంకానేమో ఇంటికొచ్చే వాళ్ళ టీచర్కి చెవి నిండుగా కమ్మలే .అంచేత పాపాయి అప్పుడప్పుడూ గునుస్తుంది అమ్మా కమ్మలూ.. అని .సరెలేవే చెవులు కుట్టించు కుందూలె అంటే, ఖతం ,కాసిని రోజులు ఆ కథే మాట్లాడదు .పాపం అట్లా దానికిప్పుడు ఆరేళ్ళు వచ్చేసాయ్...

5, అక్టోబర్ 2010, మంగళవారం

ఐననూ పోయిరావలె హస్తినకు ...

హటాత్తుగా ఒక రోజు ,నాకు బ్లాగ్ ఒకటి మొదలు పెడితే ఎట్లా ఉంటుందనిపించింది .అది మొదలు పుట్ల హేమలత (వారు "నెట్లో తెలుగు సాహిత్యం" ఫై phd చేస్తున్నారు )మేడం గారికి కష్టాలు మొదలయ్యాయి .ఎందుకంటే నేను కంప్యూటర్ జ్ఞాన సూన్యురాలిని .బ్లాగ్ ఎలా చేయగలను .అంత మాత్రం చేత నా బ్లాగ్ ఎలా పడితే అలా ఉంటె ఎలా? అంచేత మేడంని అర్థ రాత్రి అప రాత్రి కూచోపెట్టేసాను .వారు నా బ్లాగ్ని మా పాపాయంత ముద్దుగా చేసి ఇచ్చారు .మద్యన ఉన్న ఇన్ని యోజనాల దూరం ఈ సందర్భంలో ఎంత దగ్గరగా అయ్యిందో ....వారికి నా కృతజ్ఞతలు .
బ్లాగ్ అయితే తయారయింది కదా .కానీ ఏం రాయడం బ్లాగంటే పబ్లిక్ ప్రైవేటు జీవితపు విచిత్ర సమ్మేళనం అని ఈ బ్లాగుల్లోనే ఎవరో అన్నారు ..కదా మరి ఎలా మొదలు పెట్టాలో తెలియక ఒక్క పోస్టూచెయ్య లేదు ఇఇన్ని రోజులూ మా ఊర్లో అంటుంటారు .ఏమైనా సరే ఒక పని చెయ్యాల్సిందే కష్టమయినా నష్టమయినా అనుకుంటే ఐనా సరే పోయిరావలె హస్తినకని అట్లాగా ఇది ఇలా మొదలు పెట్టేసాను .
భయపడకు నేను సహా రచయితగా ఉంటానన్నది నా కూతురు .దానికి రాయడం రాదు కనక రాసి పెట్టాలి .అంతే .రాసే వాళ్ళుంటే ఎన్ని కబుర్లో ......బడికి పోయింది చిన్నిచిన్ని చేపలంత కళ్ళల్లో పెద్ద పెద్ద చెరువులంత కళ్ళ నీళ్ళు నింపుకొని .........

3, అక్టోబర్ 2010, ఆదివారం