మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

7, డిసెంబర్ 2012, శుక్రవారం

బై ...బోయ్ !!!

ఎడ్వర్డ్ ,రోసీ జోసఫీన్ లు భార్యా భర్తలు.యాంగ్లో ఇండియన్స్.వారిది ప్రేమ వివాహం .ప్రపంచం లో అత్యంత విఫల మానవ సంబంధం బహుశా ఆడ మగల వివాహమేనేమో  .

పునరుత్పత్తి కార్యం వలన ఆడవాళ్ళని అణిచి పెట్టి,ఆ పనిని  ఆడ వాళ్లపైకి తోసి ఇంటికి పరిమితం చేసి మగ వాళ్ళు తప్పు చేసారేమో .పాపం అందుగ్గానూ మగ వాళ్లకి ,ఈ ఆడవాళ్ళ నసపోటు భరించక తప్పదేమో .

దురదృష్ట వశాత్తు ప్రతి స్త్రీ ఒక నస మేళమే. చిరాగ్గా .మా ఆయన తాగుతాడు,[నువ్వూ తాగు .లేదంటే చూస్తూఊరుకో ] మా ఆయన వాళ్ళింటి వాళ్లకి డబ్బులిస్తాడు.[వాళ్ళింట్లో వాల్లకి కాదు ,మా ఇంటి వాళ్లకి ఇవ్వాలని ఉద్దేశం ]మా ఆయన ఇంకో స్త్రీతో ముచ్చటిస్తాడు [అక్కడికి స్త్రీలందరూ ఏదో ఆవిడ గారి  హీరో కోసం బారులు తీరి వున్నారన్నట్లు ]చిరాగ్గా ఇవే మాటలు.ఏ వివాహిత స్త్రీని కదిలించినా ఇవే.

వీల్లెందుకు చదువుకోరు.కుట్టు పని చేయరు.మంచి పనులు  నేర్చుకోరు.చిరాగ్గా మగడు అనే ప్రాణిని పట్టుకుని వేధిస్తూ ఏడుస్తూ వుంటారు,అసహ్యంగా అని చీదర పుడుతుంది.ఆ చీదరనంతా అణుచుకుని సమాజమూ ,మానవ ,ఆర్ధిక సంబంధాలను గుర్తు తెచ్చుకుని ఈ ఆడవాళ్ళతో మాట్లాడాలి.వీళ్ళు ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేసి సొద  వినాలి.

మొన్న కూడా పాపాయి వాళ్ళ టీచర్ చెప్పిన ఏడుపు కథనీ ,ఏడ్చిన ఏడుపునీ భరించి సహించ వలసి వచ్చింది.అసలు వీళ్ళందరికీ నన్ను చూస్తే బాధలు చెప్పుకోవాలనిపించే తనం నాలో ఏముందనే ప్రశ్న ప్రతి క్షణం వేధిస్తూ వుంటుంది .

రోసీ తన బాధ చెప్పడం కాక పాపాయిని కూడా అందులోకి లాగి ''నీ డౌరీ గా నన్ను తీసుకెళ్ళు మీనాక్షి.నిన్నేమైనా అంటే వాళ్ళని నేను కొట్టెస్తాను'' అని ఎమోషనల్ గా బోల్డు కన్నీళ్లు పెటుకుంది.పాపాయి వాళ్ళ టీచర్ కళ్ళ నీళ్ళు చూసి ఆశ్చర్య పడి ''డౌరీ అంటే ఏంటమ్మా ''అంది.బహుసా తెలుగులో చెప్పాలేమో అనుకుని ''కట్నం ''అన్నాను .పాపాయి ''కట్నం అంటే ఏంటీ'' అంది .నేను ''అదే రా పెళ్ళపుడు అమ్మాయికి అమ్మా వాళ్ళు ఇస్తారే ..''అని చెప్పబోతూ వుండగా''ఓ ..అదా 'బై  బోయ్' అని కదా ''అన్నది

అవును ''బై బోయే ...''మొన్న భానుమతితో ఇంటర్వ్యు చదువుతూ వున్నాను, ఆవిడ అంటారు ''ఎప్పుడో వరవిక్రయం లో వేశాం కట్నమూ ,ఆత్మ హత్యలూ   ...ఇన్నేళ్ళకి ఇప్పుడు కూడా  అవే సినిమాలు ''అని.

ఎన్నేళ్ళయినా బాయ్ లెప్పుడు అమ్ముడు పోతూనే వుంటారేమో చిరాగ్గా ...

అసలు నా ఈ చిరాకంతా రోసీ మీద కాదు,, రోసీనంత యేడిపిస్తున్న ఎడ్వర్డ్ మీద ..ఎడ్వర్డ్ మీద కానే కాదు ఎడ్వర్డ్ కి అంత విలువనిచ్చి ఏడుస్తున్న రోసీల మీద ,ఊహూ అదీ కాదు ,,,వివాహం మీద..అంతేనంటారా ?కాదేమో రోసీని అట్లా తయారు చేసిన ఈ సమాజం మీద !!!