డుం ..డుం ..డుం మూవీ నేనూ పాపాయి వా ళ్ళ నాన హైదరాబాద్లో చూశాం .ఎంఫిల్ లో ఉన్నాననుకుంటా అప్పుడు .జ్ఞాపకం లేదు.
ఈ పాట చాలా గుర్తొస్తూ వుండేది.ఒక సారి ఎక్కడ నుండో వచ్చి హాస్టల్ లో రూం తాళాలు తీస్తూ వుండినాను .వింగ్ కి అటు చివరి నుండి ఎవరో తమిళ్ లో హం చేస్తూ వుండినారు .వెళ్లి ఆ అమ్మాయిని పరిచయం చేసుకుని పాడించి విన్నాను.చాలా సార్లే ఆ పిల్లని పాడమని పీడించే దాన్ని .
ఆ తర్వాత చాలా సార్లు జ్ఞాపకం వచ్చేది .గత ఏడాది నా తమ్ముడు డౌన్ లోడ్ చేసిచ్చాడు.రాత్రి ఎవరో ఏదో పాట పంపించ మని అడుగుతే వెదుకుతుంటే ఇది దొరికింది .
కొన్నింటిని ఎందుకు అంత ఘనం నచ్చాయని అడుగుతే చెప్పలేం .ఈ పాట కూడా అంతే విపరీత ఇష్టం నాకు.పాట
మొదట్లో వినిపించే ఇన్స్ట్రుమెంట్ బిట్ ఎన్ని సార్లు విన్నా పిచ్చెక్కిస్తుంది .
ఇట్లా బ్లాగ్ లో దాచుకుంటే కావల్సినప్పుడంతా వినడానికి అందుబాటులో వుంటుంది కదా !
మొన్న నా పీ హెచ్ డీ వైవా కోసం హైదరాబాద్ కి ప్రయాణిస్తుంటే చివరి వరకూ నాకు తోడు వచ్చిన పాట ఇది .వింటూ వింటూ వింటూ వెళ్లాను .విమల కంటమంటే నాకు ఇష్టం .మొదట అందుకోసం పాట వింటాను .ఆ తరువాత అందులో సాహిత్యం .
ఆవిడ కంటం''ప్రజల కోసం గజ్జె కట్టి ఆడే ''ఆవిడలానే సున్నితంగా ఉంటుంది .దృడంగా ,ధైర్యంగా ,వెరపు ,బెరకు లేక అతి స్పష్టం ఉంటుంది .వింటూ ఉంటే ..వింటూ, వింటూ ఉంటే విమలక్కా అని పిలుద్దామనే ఆప్యాయత వేస్తుంది .
పొద్దున్నే ఏదో విషయమై ఫోన్ చేస్తే స్నేహితుడు,ప్రయాణం చేస్తూ చేస్తూ ఉన్న వాడు , కదిలించ గానే ''ఆడుదాం డప్పుల్ల దరు వెయ్ ర''అని మురుసుకుంటూ పాడాడు .విన గానే ఎందుకనో చప్పున పెద్ద దిగులొకటి కమ్మేసింది ..ఇప్పటికీ ఉదయం కమ్మిన ఆ దిగులు మేఘం ఉండి ఉండి కురుస్తూనే ఉంది.
వానొచ్చేనమ్మ వరదొచ్చేనమ్మ
వానతోపాటుగా వణుకొచ్చేనమ్మ
కొట్టాముపై రాలి మట్టంత కడిగింది
కోడి పుంజు జుట్టు కొంటెగా తాకింది
చెట్ల కురులపై బొట్లు బొట్లుగా రాలి
గట్ల కుండల మీద గందమై పారింది
దున్న పోతులనేమో దుంకు లాడించింది
బర్ల మందలనేమో సెర్లలోముంచింది
గద్ద గూటి లోని గడ్డీని తడిపింది
గువ్వా గూటిలోని గులక రాళ్ళని జరిపింది
తీతువు గొంతును తియ్యగ జేసింది
పరికి పిట్ట ముక్కు పాసిని కడిగింది
ఎద్దు మూపురాన్ని ముద్దాడి మురిసింది
ముళ్ళు గర్ర వళ్ళు సల్లగ జేసింది
కొత్త నీటితో వచ్చి కోనేట్లో చేరింది
పచ్చని నాసుని పలగ జేరేసింది
చేపకేమో నీటి పులుపుని దాపింది
కొంగకేమో విందు కోరికని రేపింది
కప్పల పండగ కండ్లారా జూసింది
తాబేలు పెండ్లికి తల నీరు పోసింది
యెర్ర భూముల నెర్రెలన్నీ పూడ్సినాది
రేగడి నేలను మాగాణి జేసింది
తువ్వా గడ్డలల్ల కవ్వాతు జేసింది
సౌడు భూముల జూసి దౌడు తీసినాది
పొంగేటి కల్లుల పోసింది చన్నీళ్ళు
ఈత సెట్టు లొట్టి మూతి కడిగింది
తాను రాక ముందే తూనీగల లేపి
తన పాటకే తాను దరువేసి ఆడింది
తెల్ల మల్లెనింక తేటగా జేసింది
యెర్ర మల్లెనే కడిగి ఎరుపునే పెంచింది
తులసమ్మ దీపము చిప్పలో చేరింది
నీరెండ పులుపుకు నిగ నిగ లాడింది
పారాడి పారాడి గోదారిలో కలిసి
సీతమ్మ పాదాలు శిరసొంచి తాకింది
వంకలు డొంకలు వనములన్నీ తిరిగి
కృష్ణమ్మ వడిలోన ఇష్టంగా ఆడింది
దున్దుభీ తల పోసి దుమ్మంత కడిగింది
అందమైన ఇసుకను అద్దంలా జేసింది
ఇష్టమే లేకున్నా పట్నానికోచ్చింది
ముక్కు మూసుకొని మూసీలో మునిగింది
యములాల రాజన్న వేడుక జూసింది
ముందింటి కోయ్నాక మైల కడిగేసింది
సూఫీల దర్గాల సుట్టు దిరిగీ మొక్కి
ఎగిరే దక్కిల కేమో ఎండీ మెరుపద్దింది
రావి ఆకుల నుండి రాలి పడి రాలి పడి
సాధుల సామాది సన్నిధికి చేరింది
అమరూల స్థూపానికి అభిషేకమూ జేసి
సుత్తీ కొడవలి మీద ముత్తేమై మెరిసింది .
[రెండు మూడు పదాలు అర్థం కాలేదు .తప్పులు పడి ఉండచ్చు .]
అప్పుడెట్టుండెనోచిత్తమయ్యో యెఱగనైతి చెప్పుడుమాటలకే నే జేరనైతిగా కొసరికొసరి నీపై కోపమున నుంటిగాని అసమిచ్చి నీతో మాటలాడనైతిగా పసలేని సిగ్గుతోడి పంతాననే వుంటిగాని ముసిముసి నవ్వు మోవి మోపనైతిగా విరహపు కాకల నావిసుపే చూపితిగాని సరిబిల్చితే నూకొన జాలనైతిగా వరుసవంతులకై నే వాదులాడితి గాని మురిపేన మొక్కితే నే మొక్కనైతిగా వేగమే నీవు గూడితే వెస భ్రమసితిగాని చేగలనీమేను పచ్చిసేయనైతిగా భోగపు శ్రీవేంకటేశ పోట్లదొరతిలోన నీగతి చెన్నుడవైతే నెనసితిగా
రెండువారాలక్రితంస్నేహితురాలు ఫోన్ చేసింది T T D వారి అన్నమాచార్య సంకీర్తనల సమ్మర్ కాంప్ జరుగుతుంది.రాకూడదా... మీరు ఇక్కడ ఉన్న నెలలో పాపాయికి నాలుగు పాటలన్నా వస్తాయి కదా అని .పొద్దుటే వెళ్లి ఒక గంట పాటు పాడుకుని వస్తుంటే ఎంత సంతోషంగా ఉందో.జీవితంలో ఆనందం తప్పించి మరేమీ లేని కాంతివంతమైన అనుబూతి . వదులుగా అల్లుకున్నజడలో బొండు మల్లెలు తురుముకుని వచ్చే డాన్స్ టీచర్ ,చిన్ని కూతురికి తోడుగా వచ్చే అందమైన అమ్మ , కారణం ఏదయితేనేం బోలెడు కాలం తరువాత రోజూ ఒకరినొకరం చూసుకోగలుగుతున్న నేను నా స్నేహితురాలు ,ఇంటికొచ్చి'' జగడపు చనవుల జాజర''.. అనో ''అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ '' అనో పాడేసుకుంటూ ఉంటే,,, దిగులూ వ్యసనమూ ఉండదమ్మ నీకు అని మురిసే మా నాన.. జీవితం ఎంత బాగుంది ....జీవితం ఎంత బాగుంది .హాయిగా తీయగా ఆలపించు పాటలా ,అనారు పూల తోటలా ...ప్రశాంత సాంధ్య వేళలా...జీవితం ఎంత బాగుందో ...ఈ ఎండల వేళల మా ఊరి వీధులను పసుపు వర్ణ భరితం చేసే తీయటి ఉలవ పాటి మామిడి పళ్ళలా ...జీవితం తీయ గా అనిపిస్తుంది. ''నీ వలన తప్పే లేదు మరి నీరు కొలది తామెరవు ;ఆవల బాగీరదీ దరి ఆ జలములే ఊరినయట్లు'' ...''ఎంత మాత్రము ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు ''అట. ఎంత అద్భుతమైన భావన ,''అంతరాంతరములెంచీ చూడ పిండంతే నిప్పటి యన్నట్లు ..''ఎంత సరళమైన పదాలు ఎంత గాఢమైన తాత్వికతకదా . వేంకటేశ్వరుని పైన కదా అని భక్తి భావం కాదు సంగీతానికి ఆ శక్తి ఏదో ఉంటుంది .ఆండాళ్ తిరుప్పావై వినండి అలాటిదే మరోదేదైనా వినండి .భక్తి కాదు. భాష తెలియకున్నా ఉదాత్త భావాలేవో మనలో ప్రవేసిస్తాయ్ .ప్చ్ అద్భతమైన వాటికి మనం మతాల కులాల రంగులు పులిమేస్తాం కదా ... ఒక్కో వ్యక్తికి ఒక్కో మోహం ఉంటుంది కాబోలు నాకు అట్లా సంగీతం ఓ పిచ్చి .కానీ సంగీతానికే నా పై దయ లేదు . పాడుకుంటూ ఉంటే స్నేహితురాలు ముని పంటితో నవ్వుని అదిమేసి ఎంత ముద్దుగా పాడుతావో నీ పాటల్లో ఫీలింగ్ మాత్రమే ఉంటుంది, ఇంకేమీ ఉండదు...అని అంటుంది సరదాగా .
మనం కోరుకున్నది పొందలేక పోయినంత మాత్రాన దానిపై ఇష్టం పోదు కదా ! పోక పోగా ప్రేతంలా పట్టుకుని మనల్ని మరింత పీడిస్తుంది .దిగులు పెట్టేస్తుంది .యేడి పించేస్తుంది .ఎప్పుడో ఏ కంటమో, ఏ రాగమో, ఏ సాహిత్యమో ఎందుకో ఒక పాటై మన జీవితంలో ప్రవేసించేస్తుంది . ఇక అంతే ఇదీ అని వివరించలేని ఆరాటం .ఏం చెయ్యాలో తోచదు .ఘన సమయం అంతా ఆ ఒక్క పాట చుట్టే గిరికీలు కొడుతూ ఉంటుంది. పాడుకుంటూఉంటేపాపాయో ,వాళ్ళనానోమధ్యలోమాట్లాడిస్తారు .నేనింతతాదాత్మ్యంతోపాడుకుంటూఉంటేమాట్లాడిస్తారాఎంతరసహీనులుఅనిగునుస్తే.. నీకుఇరవైనాలుగుగంటలూతాదాత్మ్యమే ...మరింకమేమెప్పుడుమాట్లాడాలిఅనినసుగుతారు .కానీఎందుకిట్లాఊపిరాడనీయకుండాచేస్తుందిఒకచిన్నిపాటఅనిదిగులు ...నాజీవితంపైఇంతఅదుపుఏమిటిఅనిబెంగ !
ఇక్కడిచ్చినపాట ఇంతకు మునుపు ఎప్పుడూ వినలేదు .పాడినావిడ ఎవరో తెలియదు ,పోసేసివ్ నెస్ తో కోపించి కలహించిన నాయిక పశ్చాత్తాపాన్ని హృదయంతరాలలో ని ఆర్తిని , ఎంత బాగా పలికించిందో ...
పాపాయివాళ్ళనానదేసాటనకివెళ్ళాడు.మధ్యలోఫోన్చేసిపలకరించాడుఏంచేస్తున్నావ్అని....ఏంచేసాను ,పలకరించే నాధుడు లేక ,ఈరోజంతాఒకపాటవింటూగడిపాను.ఏంచేస్తున్నాహెడ్ఫోన్స్తీయకుండాగడిపాను.ఆపాటనికూడాకేవలంరెండువాక్యాలకోసంవిన్నాను.అందులోనురెండోవాక్యంకోసంమరీవిన్నాను....ఆరెండోవాక్యం''నీలోనేకొలువున్నోడు..నిన్నుదాటిపోనేపోడూ..!మొదటివాక్యం''లోకాలనేలేటోడునీకుసాయంకాకపోడు''.పాటసదాశివసన్యాసితాపసికైలాసవాసీ.. .''
శివ పార్వతులు వివాహానంతరం అస్సాం ప్రాంతం లో విహరించారట అందుకే ఆ ప్రాంతాన్ని కామ రూప దేశమని అంటారట . కామాఖ్య మందిరం నుండి వస్తున్నపుడే అనుకుంటా మొదటి సారి ఈశ్వరుడు నా ప్రశ్నల పెద్ద పెట్టెలోకి చేరాడు .ఎలాంటి వాడై ఉండొచ్చు అతను ?ఒక రాజ పుత్రిక ,స్మశాన వాసిని ,సర్ప ధరుడిని ,బిక్షుకుడిని ,కట్టు బట్ట లేని వాడిని ఏం చూసి ప్రేమించి ఉండొచ్చు ?సహచరిని పాదాల పాల చేయని అతని సంస్కారపు మూలాలేవి ?భార్యే కదా ,ప్రియురాలు కూడా కాదు కదా ,అయినా సతి మృత శరీరాన్ని చూసి అతను ఎందుకలా విలయ తాండవం చేశాడు .
[నా స్నేహితురాలి తండ్రి అరవై ఏళ్ళ వయసులో ,భార్య మరణించిన ఐదు నెలలకే ,పునర్వివాహం చేసుకున్నాడు .ఇంటికొస్తే అన్ని ఉడుకు నీళ్ళు పెట్టించే వాళ్ళుంటే బాగుంటుంది కదా అన్నది ఆయన ఆలోచన . వేడి నీళ్ళకే ఐతే గీసర్ పెట్టించుకుంటే సరి పోదా అని జోక్ చేసాడు నా తమ్ముడు . ముగ్గురూ కూతుర్లే.ముగ్గరూ మాట్లాడటం మానేశారు .మా అమ్మని అంత త్వరగా మరచి పోయాడా మా నాన అని ...జ్ఞాపకాలు బ్రతికి ఉంటే మనిషి మరణించనట్టే .అవే లేనపుడు ఐదేళ్లకి ఐదు నెలలకి తేడా ఏముంటుంది .]
ప్రియత్వాన్ని అర్థ నారీశ్వరత్వంగా మలచిన ప్రేమౌన్నత్యం అతనికి ఏ దేవి వరం ?ఇంతలా స్త్రీని గౌరవించిన మరో భగవంతుడు ఏ చరిత్రలోనైనా ఉన్నాడా?యౌవనంలో ఉన్న భార్య పట్ల భాద్యతను విస్మరించి దొంగలా పారి పోయిన బుద్దుడిది స్వ సుఖ వాదం కాదా ?ప్రేమించే భార్య.. అడిగి ఉంటే అర్థం చేసుకుని అనుమతించక పోయేదా ?
అయినా మనం శివుడి ప్రేమ స్వరూపాన్ని చెప్పుకోవాల్సినంతగా చెప్పుకోం కదా .బహుశా శివుడు PR విషయంలో శ్రద్ద పెట్ట లేదేమో . ప్రచారం లోనే అన్నీ ఉన్నాయిష! ' గురు ' లు చెప్తున్నారు . అప్పుడు కూడా అదే సూత్రం మనుగడ సాగించి ఉంటుంది .శివుడి జీవితంలో ఏ గంగలు మంగలు ఉండి ఉండరు అవంతా ప్రక్షిప్తాలు. కావాలని వేసిన మచ్చ .నేను నమ్మడం లేదు .శివుడి గురించి ..రోమిలా థాపర్ నొ మరోకరిన వెదకాలి బద్దకాన్ని వదిలించుకుని .
ఒక పాట విన్నప్పుడో ,ఒక పుస్తకం చదివినపుడో ఎలా అనిపించాలి ?బహుశా ...నిర్లిప్తపు శ్వేత వర్ణం ఫటిల్లుమని చిట్లి ,పలు రంగుల ఇంద్ర చాపం మనని ఆవహించాలి .సుకుమారపు జిల్లేడు విత్తనం ,లక్ష్యం లేని గాలితో లేచి పోయినట్టు మనసుకి పిచ్చెక్కి పోవాలి .చూస్తూ చూస్తూ ఉండగానే హృదయం మసక బడి అలవి కానీ కుంభ వృష్టి కురిపించెయ్యాలి.బతుకు నీలిమ లో పున్నమి పూలు పూయాలి .నీకు నువ్వు దొరకక నువ్వెవరివో అయి పోవాలి .ఒక పుస్తకం చదివినప్పుడో ,ఒక పాట విన్నప్పుడో ఆ కాగితమో, ఆగొంతో ...దెయ్యంలా పట్టి పీడించాలి.వదిలించుకోలేక పొగిలి పొగిలి ఏడవాలి .ఓటమి పాలై ఆ పాద పద్మాలపై పడి లయమవ్వాలి .
జాన్ డెన్వర్ ఈ పాట ,అలాటిదేదో చేస్తుంది .ఆత్మని పీడిస్తుంది .వింటుంటే మీ ఊరి దారి మిమ్మల్ని పిలుస్తుంది ."థాంక్ గాడ్ అయామే కంట్రీ బాయ్ ''అని ఇంకో పాట ఉంది అదీ వినండి .మీరు పల్లెటూరి వారయితే తప్పక థాంక్ గాడ్ !అనుకుని తీరుతారు .whisper of the heart అని జపనీస్ మూవీ ఒకటుంది .యానిమేషన్ .ఆ సినిమా పొడుగూతా ఈ పాట వినిపిస్తూ ఉంటుంది .జపనీయుల భాషలో కూడా .సినిమా కూడా బాగుంటుంది .హాయో మియజాకి స్క్రీన్ ప్లే .
Take Me Home, Country Roads
Almost heaven, West Virginia, Blue Ridge Mountains, Shenandoah River. Life is old there, older than the trees, younger than the mountains, blowing like a breeze. Country roads, take me home to the place I belong. West Virginia, mountain momma, take me home, country roads.
All my memories gather round her, miner’s lady, stranger to blue water. Dark and dusty, painted on the sky, misty taste of moonshine, teardrop in my eye. Country roads, take me home to the place I belong. West Virginia, mountain momma, take me home, country roads.
I hear her voice in the morning hour she calls me, the radio reminds me of my home far away. And driving down the road I get a feeling that I should have been home yesterday, yesterday. Country roads, take me home to the place I belong. West Virginia, mountain momma, take me home, country roads. Country roads, take me home to the place I belong. West Virginia, mountain momma, take me home, country roads.
< కిటికీలో నుండి కనిపిస్తున్న కటిక చీకటిని చూస్తూ నా భర్త ,నా జ్ఞాపక శక్తికి పరీక్షపెడ్తూ ''సక్కనైన చిక్కని రాత్రి ''పాటలోని చీకటి వర్ణనని గుర్తు చేయమని అడిగాడు ,యదావిధిగా నాకు జ్ఞాపకం రాలేదు .మొబైల్ తీసి ఆ పాట ఆన్ చేసాడు ,ఆపాట తరువాత ఈ ''సంత మా ఊరి సంత ''పాట మొదలైంది .చీకటిలో ఆత్మలు, శరీరాల ఉనికిని మరచి పోతాయి కాబోలు ,ఎన్నో సార్లు విని వున్నా ఈ సారి ఈ పాట కొత్తగా తోచింది .. బెంగాల్కి రావడానికి ముందు నాకు సంతని చూసిన అనుభవం ఎప్పుడూ లేదు. బెంగాలీలో సంతని'' హాట్ ''అంటారు .ఇక్కడ ప్రతి ప్రాంతం లోను సంతలు జరుగుతాయ్. శనివారం సంత ..బుధ వారం సంతఅంటూ వారాల పేర్లతోనో,మధుర హాట్ అంటూ ఆయా ప్రాంతాల పేర్లతోనో .
మేమున్న ఈ కూచ్ బీహార్ ప్రాంతంలో తేయాకు తోటలు ఎక్కువ .తేయాకు తోటల కూలీలకి వారానికో సారి, కూలీ డబ్బులు చేతికొస్తాయి .వారి కోసమని ఆ రోజుల్లో సంత నడుస్తుంది . దీనిని ''బగానేర్హాట్ '', లేదా '' తోలపెర్ హాట్ ''అంటారు .వారపు కూలి డబ్బులతో ఇక్కడికి వచ్చిన వీరు కొని ,తిని ,తాగి ఇళ్ళకు వెళ్తారు .ఈ సంతలకి పట్టణ ప్రాంతపు సంతలకి ఉన్న ముఖ్యమైన తేడా.. మధువు దొరకడం ,దొరకక పోవడం .
బహుశ ఇవాల్టి షాపింగ్ మాల్ ల వెనుకనున్న మూల సూత్రం ఇదేనేమో .మొదటి సారి నాకు అడుగడుగునా జీవం తొణికిసలాడే సంతని చూడగానే, ఒక మినీఏచర్ జీవనదిని చూసిన అనుబూతి కలిగింది .ఇంకా మానవీయ ప్రపంచంలోనే జీవిస్తున్నాననే నమ్మకం కలిగింది .సంతోషం వేసింది .అంతలోనే ఆ నమ్మకాన్ని చెదరగొడుతూ జర్మనీ, మెట్రో కాష్ అండ్ క్యారీ కి బుద్ద దేబ్ బట్టాచార్య పలికిన ఆహ్వానం గుర్తు వచ్చి దిగులువేసింది .
మనమివాళ గ్లోబలులం కదా .అనంత హస్తాల మార్కెట్ ఈ సంత మానవీయతని మింగి వేయకుండా ఎన్నినాళ్ళు ఆగుతుంది ??.బహుసా అది ఎంతో దూరం లో లేదనుకుంటా !ఇవాళ కనిపించే ఈ సంత రేపు మనకు ఓ పురాతన జ్ఞాపకం కావచ్చు ! గోరటి వెంకన్న ఈ పాటని వింటున్నప్పుడు ఎన్ని సార్లుఅనిపించేదో , ఎంత జీవితాన్నచెప్తున్నాడో ఈ కవి అని .
పూర్తిగా కాకున్నా, ఈ పాటలోని జీవితం నాకు అపరిచితం .అయినా కవి ,నన్ను ఎన్నెన్ని సార్లు ఉద్వేగపరిచాడో .పుట్టినూరోల్లోస్తే పట్టుకుని ఏడ్చిన కొత్త కోడలి కన్నీటి చెమ్మ ,విన్న ప్రతి సారి హృదయాన్ని తడుపుతుంది .కందూరు జానమ్మ కోపం ,సంతలో సంసారమంతా బయటేసుకుని ,ఇంటికెళ్ళే ముందు ఒక్కటయ్యే మొగుడూ పెళ్ళాల వైనం ముచ్చట గొలుపుతుంది ..''
కల్లు దుకునంలో కలిసి, తాగి ,తిని,వరుస గలుపుకొని వియ్యమందానీకి తయ్యారయ్యే ''లౌక్య రాహిత్యపు సామాజికతముందు, ఆడంబర ప్రదర్శనల మన సోషలైట్ పార్టీలు వెల తెల బోయి తల వంచుకుని కనపడతాయి .రవీంద్రుడు సంత పైన ఒక పద్యం రాసాడు .అదీ ఇక్కడ ఇస్తున్నాను.నాకు అర్థమైనంత మేర ప్రతి లైన్ క్రింద దాని అర్థాన్ని ఇచ్చాను .
రవీంద్రుడి సంతలో రోమాన్టిసిసం మాత్రమే కనిపిస్తుంది .గోరటి పాటలో జీవితపు అన్ని పార్శ్వాలు కనిపిస్తాయి .పాటచివర వినబడే చెంచు బీసన్నని బలిగొన్న, మొండి కర పత్రపు వైనం ఆశ్చర్యపరుస్తుంది .ఎలా చెప్పగలిగాడీ కవి ఇంత బండ, నగ్న సత్యాలని ఇంత సరళసున్నితంగా అని అబ్బురమేస్తుంది .
పాట పూర్తయ్యేసరికి ''గొంతు పిసికేసిన గోసలా రాజ్యం '' మనల్ని భయ పెడ్తుంది. ''సితికిన బతుకుల సంత'' ఆపుకోనీయకుండా ఏడిపించి వదుల్తుంది.ఇంత అద్భుతాన్ని కనుల ముందు ఆవిష్కరించిన... ఈ రాపు గొంతు ,మేధో కవి గాయకుడ్ని ఎంత కీర్తిస్తే మాత్రం సరిపోతుంది !