మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

1, నవంబర్ 2010, సోమవారం

పథేర్ పాంచాలి -అందగత్తె ఈ పుస్తకం


పాపాయికి చాలా కథల పుస్తకాలున్నాయ్ .దానికి వాటిలో " అమ్మ చెప్పిన కతలు "అనే పుస్తకమంటే మరీ ఇష్టం .ఒక సారి ఆ పుస్తకం నానకి చూపించి నానా ఈ పుస్తకంలో మంచి మంచి కథలుంటాయి మేక కథ ,పులికథ ,దెయ్యం కథ... అందగత్తె నానా ఈ పుస్తకం అని చెప్పింది. పుస్తకాన్ని అందగత్తె అని అనడం నేనదే మొదటి సారి వినడం .ఆశ్చర్య పడ్డాను ఆ మాట చాల సార్లు గుర్తొచ్చేది .

మొన్న అనుకోకుండాపుస్తకాల అలమర నుండి పథేర్ పాంచాలి పుస్తకాన్ని తీసాను ఈ శని ,ఆదివారాలు ఆ పుస్తకానికి అంకితం చేయాల్సి వచ్చింది.పుస్తకం ముగించిన తరువాత అనుకోకుండా ఉండ లేక పోయాను అందగత్తె ఈ పుస్తకమని .

మొన్న వేసవిలోననుకుంటా ఇంటికెల్లినప్పుడు మా డిగ్రీ కాలేజ్ తెలుగు లెక్చరర్ బిబూతి భూషణ్ మరో పుస్తకం "వనవాసి "కి తప్పొప్పులు దిద్దుతున్డినారు. hbt గీత గారు మేడమ్కి స్నేహితురాలు .మేడం కోసమని వనవాసి మాతృక ''అరణ్యక'' పట్టుకేల్లెను.''వనవాసి'' ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేసింది కాని నేను ఇంకా చదవలేదు .

బిబూతి భూషణ్ ఇంకా చాలా నవలలూ ,రెండొందల దాకా కథలూ రాసారట .కానీ ఇదే ఆయన ప్రఖ్యాత నవల .సత్యజిత్ రే ప్రఖ్యాత చలన చిత్రం పథేర్ పాంచాలి కి మాతృక .రచయిత మరణించిన పిదప ఆయన భార్య అనుమతితో ఈ నవల సినిమా రూపాన్నితీసుకొందినవల చదవక ముందు సినిమా కనక చూసి వుంటే సినిమా నిశ్చయంగా గొప్ప సినిమానే కాని నవల చదివి సినిమా చూస్తే నవల ఆత్మ అతి కష్టం మీద సినిమాలో కి వచ్చిందని తెలిసిపోతుంది సినిమా కున్న పరిమితుల దృష్ట్యా అది తప్పదేమోహరి హరుడు ,సర్వ జయ ,ఇందిరమ్మ ,దుర్గ ,అపు ఇందులో ప్రధాన పాత్రలు .బిభూతి భూషణుడి స్వీయ జీవితం పరిశీలిస్తే అపు పాత్ర అతని ఛాయల తో నడుస్తందని మనకు అర్థం ఔతుంది .

ఇందిరమ్మ పాత్రతో నవల ప్రారంభమౌతుంది .కొన్ని పేజీల తరువాత ఇందిరమ్మ పాత్ర చని పోతుంది కానీ సత్యజిత్ రే ఆ పాత్రను సినిమా దాదాపు చివరికొచ్చే వరకు బ్రతికించాడు .బహుశా సినిమాలో ఆ పాత్రదారి నటన అందుకు పురికోల్పిందేమోనని నాకు అనిపించింది .శరత్ శ్రీకాంత్ నవలలోని ఇంద్ర నాథుని పాత్ర స్వల్ప నిడివిలోనే పాటకుల పైన ఎంత ప్రభావం చూపుతుందో ఈ ఇందిరమ్మ పాత్ర ,ఆమెపై దుర్గ కి గల ప్రేమ మనపై అలాంటి ముద్రే వేసి వెళతాయి .నవల చివరి వరకూ మనం ఇందిరమ్మ పాత్రను ఆమె చెంబు శాలువాలనూ మరిచి పోనేలెం .

తరువాతి పాత్ర దుర్గ .ఒక సారి పుస్తకం చదివారా ఇక మీరెప్పటికి దుర్గ ని మరిచి పోలేరు .అలా మరచి పోకుండా ఉండటానికి ఆ పిల్ల మిమ్మల్నేమీ చేయదు .వాళ్ళమ్మ చెప్పినట్టు "ఆగమ్మ కాకి ల"అలా తిరుగుతూ ఉంటుంది .ప్రకృతి, ఆ పిల్ల వేర్వేరుగా మనకెప్పుడూ కనిపించరు .ఆ పిల్ల స్వేఛ్చా ప్రవృత్తి ,ఆ పిల్ల తిరిగే ప్రకృతి కలిసి మన మనసులోకి ప్రవేశించి ఇక అక్కడనుంచి కదలి పోవు .ఎంత కాలమైనా సరే .ఇంద్ర నాథుడు మనల్ని వదిలి పోనట్టు .

దుర్గాకి తమ్ముడి పైన ,అపూ కి అక్కపైన ఉండే అపురూపమైన ప్రేమ కూడా మనల్ని కట్టి వేస్తుంది .చిన్న వయసు పిల్లలలో కనిపించే దొంగిలించే అలవాటు దుర్గకి కూడా ఉంటుంది .ఒక సారి పూసల పేరు దొంగలిస్తుంది.పక్కింటి వాళ్ళు ఆ సందర్భంలో సర్వజయతో గట్టి గొడవ పాడుతారు ఇంకో సారి పక్కింటి రాణు పెళ్లి జరుగుతూ ఉంటుంది .వాళ్ళది బంగారు కుంకుమ భరిణ పోతుంది .ఆ సందర్భంలో దుర్గ మీద దొంగతనం మోపి రక్తాలోచ్చేట్టు కొడతారు ."దాని సంగతి మీరింకా తెలుసుకో లేదు దొంగకి దెబ్బ తప్ప మరో మందు లేదనుకో నే ;చెపుతున్నాగా దెబ్బలు అపుడే ఏమయ్యాయి ?ఆ వస్తువు దొరకనిదే దీన్ని విడిచి పెడతాననుకున్నావా?హరి హరి రాయ్ నన్నేం తల తీసిమోలేస్తాడ ''అంటుంది ఒకావిడ ఆ సందర్భంలో .అప్పటి ఆ పిల్ల నిస్సహాయ స్థితి ,పేద వాడు కనుక పిల్లనేం చేసినా ఆ తండ్రి ఏమీ చేయలేడనే వారి ధీమా .మొత్తం కలిపి ఆ సంఘటన దుర్గపై సానుబూతిని కలిగిస్తుంది .మునుపటి దొంగతనం సంగతి మరచి పోయి కల వారి దౌర్జన్యం పై ద్వేషం ఏర్పరచుకుంటాం .దుర్గపై ఏమాత్రం అనుమాన పడం .కానీ దుర్గ మరణం తరువాత ఒక రోజు ఆ కుంకుమ భరిణ ఇంట్లోని అటక పై నుండి జారి అపూ కంట్లో పడుతుంది .అపూ దాన్ని చూసి విస్తు పోతాడు .{అపూ తో పాటు రచయిత ఆ రహస్యాన్ని విప్పి మనల్ని ఆశ్చర్య పరుస్తాడు.}మరేం ఆలోచించకుండా ఆ చిన్ని కుర్రాడు దాన్ని దూరంగా పొదల్లోకి విసిరి పడేస్తాడు .అక్కకు సంభందించిన ఆ రహస్యాన్ని ఎవరితో పంచుకోడు. చివరకి తల్లితో కూడా.

అలాగే సుదర్శన్ అనే పురుగు కనిపించినప్పటి సంఘటన, అప్పటి దుర్గ మనః స్థితి చిత్రణ కూడా నన్ను బాగా ఆకట్టుకుంది పేద తల్లులు .పిల్లలు ,రోజు గడవటమే కష్టమైన చోట వారిలో కనిపించే విభిన్న రకాల భావోద్వేగాలు .ఆ సంఘటనలు చిత్రించడంలో రచయిత నేర్పు .విపరీతంగా ఆకట్టుకుంటాయి .ఇందిరమ్మ పట్ల సర్వజయ కటినమైన ప్రవర్తన రచయిత సహజత్వానికి దగ్గరగా చిత్రిస్తాడు .అసహాయులైన ఆడవారు చాలా సార్లు తమ అక్రోసాలని పిల్లలపై ,ముసలాళ్ళపైనే ప్రదరిస్తారు .రాయ్ దీనిని మరీ అమానవీయంగా భావించాడేమో కొంత సరలీకరించాడు .

సత్యజిత్ రాయ్ పై భారత దేశ పేదరికాన్ని మరీ ఎక్కువ చేసి చూపించాడనే అపవాదు ఉందని నేను చాల సార్లు చదివాను .బెంగాల్ను చూస్తే ఆ అపవాదు అబద్ధమేమో అనిపిస్తుంది .ఎప్పుడో 1929 ప్రాంతాలలో రాసిన ఆ నవలలో చిత్రించబడ్డ పేదరికం బెంగాల్లో నాకు ఇప్పటకి ఏ మార్పూ లేకుండా ఉన్నట్లే అనిపిస్తుంది .ఈ నాటికి వ్యవసాయం ,వ్యవసాయాధారిత కార్యక్రమాలు తప్ప మరో దారీ తెన్నూ లేని ప్రజలు ,చాలీ చాలని భూమి ,కుప్పలు తెప్పలుగా మనుషులు ,దాంతో పాటు ఏ దిగులూ భయం లేకుండా ఇంతేసి లావున కనిపించే చెట్లతో ....మా అమ్మమ్మ కాలం వాడైన బిభూతి భూషణ్ కాలంలో ఎలా ఉందొ , నా కాలంలోనూ బెంగాల్ అలాగే ఉంది .

నవల చదవండి .చదివిన తరువాత మీరే అంటారు అందగత్తె ఈ పుస్తకమని ....

3 కామెంట్‌లు:

Hemalatha చెప్పారు...

చాలా చక్కగా రాస్తున్నావు. ఈ మధ్య ఇక్కడి వరకు రాక ...చూడనే లేదు.అమ్మ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారా?నాకైతే నీ బ్లాగు చదువుతుంటే నెల్లూరు లో ఉన్నట్టే వుంది.మళ్ళీ శరత్ ని గుర్తు చేస్తున్నావు. ఎంతో ఆహ్లాదంగా వుంది నీ శైలి.అభినందనలు.

గోదారి సుధీర చెప్పారు...

మేడం ,మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు ,చాలా వాటికే చెప్పాలి అన్నింటిని పెట్టి కూడితే చివరికి మిగిలిన " కృతజ్ఞత " ఇది .అమ్మా వాళ్ళు వెలి పోయారు

lakshmi చెప్పారు...

nee blog chala bagundi. nee blog chadivite nenu chala refresh avutanu. thank you very much