మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

15, మే 2011, ఆదివారం

టైలర్ పెంచలయ్య కూతురు మరియు మమత దీ!


ఇవాళ పాపాయి వాళ్ళ నాన్న నాకో అందమైన మెసేజ్ పంపించాడు .చదవగానే చాలా సంతోషం వేసింది .చెప్పాలంటే కొంత గర్వంగా కూడా అనిపించింది .ఆ మెసేజ్ ఇది .....

india now ruled by ...
amma in south ;
didi in east ;
bahenji in north;
aunty in d capital;
madam in center.
tai as president
&
wife at home
its a women's world

నాకు పై అందరిలో మమత దీ అంటే చాలా ఇష్టం .బెంగాల్ లో ఉంటున్నానని కాదు .బెంగాలీలు పూజించే కాళికాంశ ఆవిడలో ఉందనీ కాదు .ఆవిడ వ్యవహారం లో కనిపించే సిసలైన స్త్రీత్వమంటే నాకిష్టం .ఆవిడ mood swings అంటే నాకు ముచ్చట .ఆవిడ ధిక్కార శైలి అంటే నాకు ఆరాధన .ఆ తరువాత మాయావతి ,జయ లలితలంటే గౌరవం .

ఇక పోతే టైలర్ పెంచలయ్య కూతురు గురించి :ఈ అమ్మాయి పేరేమిటో నాకు తెలీదు .చూసింది కూడా లేదు .నేను బెంగాల్ లో ఉండగా బహుశా నెల క్రితం అనుకుంటా.. మా అమ్మ ఫోన్ చేసి చెప్పింది ,పెంచలయ్య కూతురు చచ్చి పోయింది అని .ఆ పిల్ల తనొక్కటే చని పోలేదు, తనకు పుట్టిన ఇద్దరు పిల్లల్ని మొదట బావిలో వేసేసి .తరువాత తను దూకింది .

ఆ పిల్ల చెల్లికి ఇటీవల పెళ్ళి జరిగింది .ఇప్పటి కట్నాల రేటు ప్రకారం అక్కకంటే చెల్లికి కట్నం ఎక్కువ ఇచ్చారట .తేడా మొతాన్ని ఇప్పుడు ఇవ్వాల్సిందే అని పేచీ పెట్టాట్ట భర్త .తల్లిదండ్రులు ఇవ్వలేక పోయారు .భరిస్తానని ప్రమాణాలు చేసిన భర్త ఆ పిల్లను యమ కూపం వైపు నడిపించాడు .

పెంచలయ్య ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ నాతో ఫోన్ లో మాట్లాడించింది .యెట్లా జరిగింది అన్న దానికి అతను పై వివరణ ఇచ్చాడు .నేను AP కి వచ్చిన తర్వాత పెంచలయ్య ఇంటికి వచ్చాడు .పిల్లల్ని కూడా చంపేయడం ఎందుకు అని మా అమ్మ బాధ పడుతుంటే .. ...ఎవరు చూస్తార్లే అమ్మ అన్నాడు నిరాసక్తంగా .

మరో సారి వచ్చినపుడు పెట్టిన నగలు ,డబ్బు ఇచ్చేసినారమ్మ అల్లుడోళ్ళు .మా వోళ్ళు డబ్బు తెచ్చుకున్నారు ,దాంట్లో నాకొక పది వేలు ఇచ్చుంటే ఏమమ్మ [పెంచలయ్య పరమ తాగుబోతు ]అని యాష్ట పడ్డాడు .

జీవితం కథలు కాకర కాయలకంటే భిన్నంగా ఉంటుంది .మమతా దీ కి అంత మొండి పట్టుదల ఎక్కడిది ?పెంచలయ్య కూతురు చావునే చివరి పరిష్కారంగా ఎందుకు ఎంచుకుంది ?పెంచలయ్యని ఏమనాలి ...కూతురు శవం మీద డబ్బులేరు కుంటున్నాడన ?ఎందుకో ఇవాళ చాలా ప్రశ్నలు, ఆలోచనలు కలిగేసాయి హటాత్ గా .

సాహిత్యంలో రచయితలు చెయ్ చేసుకుని జీవితపు ఒక డైమన్షన్ నే మనకి చూపిస్తారు .మన ముందు ,మనతో కలిసి నడుస్తున్న ఈ ప్రపంచానికి ముఖాలు అనేకం .మనం ఏ ముఖం చూస్తున్నామో ఆ ముఖం బహుశ మనదేనేమో .కాదంటారా !

కామెంట్‌లు లేవు: